Thursday, 3 January 2019

తాను నేను

మనసు పెళ్ళికి భాజాలు దేనికి
మంత్రాలు ఎందుకు..

నాలుగు కళ్ళు సాక్షిగా
నాలుగు అడుగుల తోడులో
నవ్వులను అద్దుకున్న మత్తైదువుల లాంటి అధరాల ఎదురుగా
పంచభూతాలను ప్రేక్షకులను చేసి
రెండు మనసులు చదువుతున్న వేద మంత్రాలు సాక్షిగా
జరిగేది కూడా మనువే..

ఆత్మ సాక్షి ముందు చేసిన వాగ్ధానం ఇది
నేను చేసింది ఆత్మ నైవేద్యమే..

నీ పక్కన నే లేకపోయినా
నా పక్కన నీ చోటు ఖాళీ లేదెప్పుడు..

మనసును ఒకరికి
తనువును ఒకరికి
పంచుకోవడం తెలియదు కానీ

ఒక పేరుకు మనసా వాచ
అంకితం అవ్వడంలో ఉన్న అనుభవమే వేరు..

బతుకుని నీకు రాసిచ్చేసా
లాభనష్టాల లెక్కలు నాకెందుకు...
ఫలితంలో నువ్వెప్పుడు నా గర్వానివై కనిపిస్తున్నాక..

ఓయ్.....ఎవరికి చెందనిదే ఇది
నీకై మాత్రమే పుట్టింది ఈ ప్రాణం..

✍️అరుణిమలు

No comments:

Post a Comment